శ్రీకాకుళం జిల్లాలో బతికున్న యువకుడిని చంపేసిన సచివాలయ సిబ్బంది

ABN , First Publish Date - 2021-09-09T00:01:37+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో బతికున్న యువకుడిని చంపేసిన సచివాలయ సిబ్బంది

శ్రీకాకుళం జిల్లాలో బతికున్న యువకుడిని చంపేసిన సచివాలయ సిబ్బంది

శ్రీకాకుళం: బతికున్న వ్యక్తిని సచివాలయ సిబ్బంది చంపేశారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తిని చనిపోయినట్లు చూపారు. ఈ ఘటన కొత్తూరు మండలం పసపలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కలగాటి కోటేశ్వరరావు 2019లో వివాహం అయింది. అప్పటివరకూ తల్లిదండ్రులతో పాటు రేషన్ కార్డులో ఉన్న తన పేరును తొలగించుకుని కొత్త రేషన్ కార్డు కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలో చాలా మందికి బియ్యం కార్డులు మంజూరయినా కోటేశ్వరరావుకు మాత్రం రాలేదు. రెవెన్యూ సిబ్బందిని సంప్రదించడంతో కోటేశ్వరరావు చనిపోయినట్లు రికార్డుల్లో ఉందన్న విషయం తేలింది. తండ్రి రేషన్ కార్డు నుంచి కోటేశ్వరరావు పేరును తొలగించిన సచివాలయ సిబ్బంది పొరపాటున అతడు మరణించినట్లు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి బాధితుడు జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాను జీవించి ఉన్నా చనిపోయినట్లు చూపుతూ రేషన్ కార్డు మంజూరు చేయడం లేదని కోర్టు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-09-09T00:01:37+05:30 IST