శ్రీకాకుళంలో నేటి నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోత
ABN , First Publish Date - 2021-10-12T14:34:12+05:30 IST
విద్యుత్ సంక్షోభంలో భాగంగా నేటి నుంచి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధించనున్నారు.
శ్రీకాకుళం: విద్యుత్ సంక్షోభంలో భాగంగా నేటి నుంచి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు జిల్లా యంత్రాంగం నేటి నుంచి అమలు చేయనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ప్రకటించారు. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు విద్యుత్ శాఖ అధికారులు మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.