జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్న సిక్కోలు వాసులు

ABN , First Publish Date - 2021-11-24T17:08:04+05:30 IST

శ్రీకాకుళం: ట్రావెల్ యాజమాని నిర్వాకానికి సిక్కోలు వాసులు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్నారు.

జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్న సిక్కోలు వాసులు

శ్రీకాకుళం: ట్రావెల్ యాజమాని నిర్వాకానికి సిక్కోలు వాసులు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్నారు. సింధు పుష్కరాలకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా, పాలకొండకు చెందిన 120 మంది యాత్రికులకు ట్రావెల్ యాజమాని కుట్రా కాంటినెంటల్ హోటల్‌లో బస ఏర్పాటు చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఒక్కొక్కరు రూ. 10 వేలు కట్టాలంటూ హోటల్ యాజమాన్యం యాత్రికులను నిర్బంధించింది. ఏం చేయాలో తెలియక యాత్రికులు తమను స్వగ్రామాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-11-24T17:08:04+05:30 IST