వంశధార నదికి క్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-09-14T16:34:59+05:30 IST
జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.
శ్రీకాకుళం: జిల్లాలోని వంశధార నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గొట్టాబ్యారేజి వద్ద ఇన్ ఫ్లో...16460 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో...16460 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వంశధార నది పరివాహక మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఒడిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.