రెండోసారి ప్లాస్మా దానం
ABN , First Publish Date - 2020-09-23T11:03:03+05:30 IST
హిరమండలానికి చెందిన పొగిరి బుచ్చిబాబు కొవిడ్ నుంచి కోలుకుని జిల్లాలో రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.
హిరమండలం,సెప్టెంబరు 22: హిరమండలానికి చెందిన పొగిరి బుచ్చిబాబు కొవిడ్ నుంచి కోలుకుని జిల్లాలో రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈయన స్థానిక గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గత నెలలో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడికి ప్లాస్మాదానం చేశారు. రెడ్క్రాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరలా ప్రాథమిక పరీక్షలు చేయించుకుని మంగళవారం శ్రీకాకుళం రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో రెండో పర్యాయం ప్లాస్మా ఇచ్చారు.
రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. బుచ్చిబాబును ఆదర్శంగా తీసుకుని కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ పీఆర్వో పి.చైతన్య తదితరులు పాల్గొన్నారు. బుచ్చిబాబు ఇప్పటి వరకు 19 సార్లు రక్తదానం చేశారు.