శ్రీకాకుళంలో వాహనదారుడికి షాక్

ABN , First Publish Date - 2021-10-17T23:36:26+05:30 IST

ల్లా పెట్రోల్ బంక్ యాజమానులు యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా...

శ్రీకాకుళంలో వాహనదారుడికి షాక్

శ్రీకాకుళం: జిల్లాలో పెట్రోల్ బంక్ యాజమానులు యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గణపతి ఏజెన్సీ పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్లు కలిపి అమ్మకాలు సాగిస్తున్నారు. దామోదరరావు అనే వ్యక్తి తన కారులో పెట్రోల్ పోయించుకుంటే కొద్దిసేపటికే వాహనం ఆగిపోయింది. మెకానిక్ దగ్గరకు వెళ్తే పెట్రోల్‌లో నీళ్లు కలపడం వల్ల ఇంజిన్ ఆగిపోయిందని తెలిపారు. దీంతో బంకు యజమానిని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. 



Updated Date - 2021-10-17T23:36:26+05:30 IST