శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-10-01T15:07:40+05:30 IST

జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగివున్న డీసీఎంను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సోంపేట నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్రి మాధవరావు (34), నెల్లిమర్ల డిల్లీరావు (36)గా గుర్తించారు. 

Updated Date - 2020-10-01T15:07:40+05:30 IST