పోలీసుల అదుపులో శ్రీకాళహస్తి ఆలయ కేసు నిందితులు!

ABN , First Publish Date - 2020-09-21T00:01:38+05:30 IST

శ్రీకాళహస్తి ఆలయ కేసు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పాత టూవీలర్లను విక్రయించే ముగ్గురిని పోలీసులు నిందితులుగా గుర్తించారు.

పోలీసుల అదుపులో శ్రీకాళహస్తి ఆలయ కేసు నిందితులు!

తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ కేసు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పాత టూవీలర్లను విక్రయించే ముగ్గురిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. టూవీలర్లపై ఆలయానికి వచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురి వెనుకెవరున్నారన్న కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వరం లింగం పక్కనే లింగం, నంది ప్రతిష్ఠాపన చేశారు. ఈ విషయం వెలుగులోకి రావటంతో అధికారులు వాటిని తొలగించి సంప్రోక్షణ చేయించారు. 

Updated Date - 2020-09-21T00:01:38+05:30 IST