శ్రీలంకలో అరెస్టయిన భారతీయ మత్స్యకారుల విడుదల

ABN , First Publish Date - 2021-03-27T20:18:31+05:30 IST

ఇటీవల అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంక

శ్రీలంకలో అరెస్టయిన భారతీయ మత్స్యకారుల విడుదల

కొలంబో : ఇటీవల అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలను వేటాడుతున్నారనే ఆరోపణలపై వీరిని శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. శుక్రవారం 40 మందిని, శనివారం 14 మందిని శ్రీలంక విడుదల చేసినట్లు భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 


శ్రీలంక ఉత్తర, ఈశాన్య సముద్ర జలాల్లో మార్చి 24న 54 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వీరు తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలను వేటాడుతున్నట్లు ఆరోపించింది. వీరి నుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సమాచారం అందిన తర్వాత శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ స్పందిస్తూ,  అరెస్టయినవారికి దౌత్యపరమైన సహాయం అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై మానవతావాదంతో వ్యవహరించాలని కోరింది. ద్వైపాక్షిక యంత్రాంగాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-03-27T20:18:31+05:30 IST