Sri laxminarasimhaswamyకి 3.16 కేజీల బంగారం వితరణ
ABN , First Publish Date - 2021-10-27T13:29:06+05:30 IST
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణతాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమ భవన్ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రాహ్మణ
హైదరాబాద్/నల్లకుంట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణతాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమ భవన్ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపకుడు గిరిప్రసాద్శర్మ వెల్లడించారు. దేవాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించిన సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప ధార్మిక నేత అని కొనియాడారు. హైదర్గూడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దాతలు, సంక్షేమ భవన్ సభ్యులందరి సహకారంతో డిసెంబరు 9న సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సీఎంను కలిసి బంగారాన్ని, నగదును అందజేస్తామన్నారు.