కేసీఆర్ వల్లే ఈటలకు గౌరవం దక్కింది: శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-06-13T02:07:36+05:30 IST

సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

కేసీఆర్ వల్లే ఈటలకు గౌరవం దక్కింది: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. కేసీఆర్‌తో ఐదేళ్ల క్రితం గ్యాప్ ఏర్పడితే అప్పుడే మంత్రి పదవి ఎందుకు వదులుకోలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్, టీఆర్ఎస్ వల్లే ఈటలకు గౌరవం దక్కిందన్నారు. విప్లవ రచయిత సంఘం నేత వరవరరావును జైలులో పెట్టిన పార్టీలో ఎలా చేరుతున్నారు? అని ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? అని శ్రీనివాస్ గౌడ్ మరోసారి ప్రశ్నించారు.

Updated Date - 2021-06-13T02:07:36+05:30 IST