జడ్పీ సీఈఓగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-05-11T06:06:17+05:30 IST
జిల్లా పరిషత్ సీఈఓగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతపురం విద్య, మే 10: జిల్లా పరిషత్ సీఈఓగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న ఆయనను ఎఫ్ఏసీ జడ్పీ సీఈఓగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సీఈఓ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది, సంఘాల నాయకులు పుష్ఫగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు జడ్పీ శర్మ, బాబాఫకృద్దీన్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.