శ్రీరామునిగా వేణుగోపాలుడు
ABN , First Publish Date - 2021-03-03T05:29:34+05:30 IST
తర్లుపడులో వెలసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి హనుమంత వాహనం పై శ్రీరామ అవతారంలో వేణుగోపాలుడు భ క్తులకు దర్శనమిచ్చారు.
తర్లుపాడు, మార్చి 2: తర్లుపడులో వెలసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి హనుమంత వాహనం పై శ్రీరామ అవతారంలో వేణుగోపాలుడు భ క్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అ ర్చకులు కె.వి.రమణాచార్యులు, శ్రీమన్ చలమాచలం, చెన్నకేశవాచార్యులు, కూనపులి ర మణయ్య శర్మ స్వామి వారిని ప్రత్యేకంగా అ లంకరించారు. శ్రీరాముడు అవతారంలో వేణుగోపాలస్వామి తర్లుపాడు పురవీధులలో అంగరంగ వైభవంగా భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారికి భక్తులు వార్లుపోసి కాయకర్పూరాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఉభయదాతలు కి.శే. కశ్శెట్టి వెలుగొండ స్వామి ధర్మపత్ని రామలక్షమ్మ, శ్రీనివాసగుప్త ధర్మపత్ని ఇంద్రాని, వెంకట జగన్ బాబు ధర్మపత్ని భాగ్యలక్ష్మీలు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ధర్మకర్త జవాజి విజయభాస్కరరావు, వివిధ వాహనాల ఉభయదాతలు, భక్తుల పాల్గొన్నారు.