శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-11T15:49:53+05:30 IST

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు

కర్నూలు జిల్లా: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు ఆదివారం మహాదుర్గ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం స్వామి అమ్మవార్లను కైలాసవాహనంపై  శ్రీశైల పురవీధులలో ఊరేగింపుతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. 


శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు తరించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

Updated Date - 2021-04-11T15:49:53+05:30 IST