శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద ఉథృతి

ABN , First Publish Date - 2021-07-30T01:38:55+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద ఉథృతి

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 4,72,678 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,76,170 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.40  అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 211 టీఎంసీలుగా నమోదు అయింది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


Updated Date - 2021-07-30T01:38:55+05:30 IST