శ్రీశైలం స్వామిఅమ్మవార్ల దర్శనం వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-12-26T03:12:47+05:30 IST

శ్రీశైలం ఆలయంలో జనవరి 1న స్వామిఅమ్మవార్ల దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో లవన్న వెల్లడించారు. శ్రీశైలం ఆలయం పరిపాలన భవనంలో....

శ్రీశైలం స్వామిఅమ్మవార్ల  దర్శనం వేళల్లో మార్పులు

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో జనవరి 1న స్వామిఅమ్మవార్ల  దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో లవన్న  వెల్లడించారు. శ్రీశైలం ఆలయం పరిపాలన భవనంలో అన్ని విభాగాల ఉద్యోగులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఈవో లవన్న మాట్లాడుతూ జనవరి 1న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శనం గర్భాలయ అభిషేకాలు తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. జనవరి 1న వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి సుప్రభాతం, మహామంగళహారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం 4 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారని ఈవో లవన్న స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-26T03:12:47+05:30 IST