Srisailam జలాశయానికి కొనసాగతున్న వరద నీరు
ABN , First Publish Date - 2021-11-26T13:57:14+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 41,628 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 867 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 129.7760 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.