AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
ABN , First Publish Date - 2021-09-08T13:46:13+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది.
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరదనీరు కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ప్లో : 1,54,997 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 34,255 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా... ప్రస్తుత నీటిమట్టం 876.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటినిల్వ 170.6640 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.