శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-19T13:44:02+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,46,685 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1 లక్ష 95 వేల 274 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-09-19T13:44:02+05:30 IST