పండితులకు ఉగాది పురస్కారం
ABN , First Publish Date - 2021-04-14T06:21:12+05:30 IST
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పం డిత సత్కార కార్యక్రమాన్ని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం దేవస్థానం అధికా రులు నిర్వహించారు.
శ్రీశైలం, ఏపిల్ 13: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పం డిత సత్కార కార్యక్రమాన్ని అక్కమహాదేవి అలంకార మండపంలో మంగళవారం దేవస్థానం అధికా రులు నిర్వహించారు. ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు, ఆస్థాన సిద్ధాంతిని శాలువాలు, నూతన వస్ర్తాలు మొదలైనవాటితో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జె. వీరభద్రయ్య, వేదపండితులు ఘంటా రాధాకృష్ణా, అమ్మవారి ఆలయ ఉప ప్రధానార్చకులు ఎం. సుబ్రహ్మణ్యశర్మ ఈ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.