స్వామి అమ్మవార్లకు దీపాలంకరణ సేవ
ABN , First Publish Date - 2021-05-18T05:51:14+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు.
శ్రీశైలం, మే 17: శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేసి అర్చకులు వేదమంత్రోచ్చరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు.