స్టాఫ్ నర్సుల ధర్నా
ABN , First Publish Date - 2021-06-19T04:59:47+05:30 IST
తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు ఏలూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.
ఏలూరు క్రైం, జూన్ 18: తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు ఏలూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఐదు రోజులుగా వీరు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి మాట్లాడుతూ తమపై వివక్ష చూపుతూ 299 జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే 28న సమ్మె చేస్తామని హెచ్చరించారు.