ఓటమి నుంచే గెలుపునకు మెట్లు

ABN , First Publish Date - 2021-10-17T05:36:27+05:30 IST

ఓటమి పునాధులపై గెలుపు మెట్లు నిర్మించుకోవాలని ఎస్‌ఐ వై.నాగరాజు అన్నారు.

ఓటమి నుంచే గెలుపునకు మెట్లు


మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 16: ఓటమి పునాధులపై గెలుపు మెట్లు నిర్మించుకోవాలని ఎస్‌ఐ వై.నాగరాజు అన్నారు. భగత్‌సింగ్‌ కాలనీలో వైసీపీ రాష్ట్ర సహాయకార్యదర్శి కంది ప్రమీళారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. పతంగ్‌ సీనియర్‌ టీం మొదటి బహుమతి గెలుచుకుంది. రూ.25 వేల నగదును కంది ప్రమీళారెడ్డి సమకూర్చగా ఎస్‌ఐ నాగరాజు అందించారు. పతంగ్‌ జూనియర్‌ టీం రూ.10116 గెలుచుకుంది. ఏ1 గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మూడో బహుమతిగా రూ.7116 గెలుచుకుంది.


Updated Date - 2021-10-17T05:36:27+05:30 IST