ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్
ABN , First Publish Date - 2021-05-07T15:06:08+05:30 IST
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా సింపుల్గా కార్యక్రమం జరిగిపోయింది. ముఖ్యమైన అతిథులను మాత్రమే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
స్టాలిన్ కేబినెట్ ఇదే..
స్టాలిన్ కేబినెట్లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ యువకులు, కొత్త వారికి స్టాలిన్ అవకాశం ఇచ్చారు. దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్సెల్వం, కేకేఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
కాగా.. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 156 సీట్లను గెల్చుకుని అన్నాడీఎంకే కూటమికి షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో దశాద్దకాలం తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదిలావుంటే.. బుధవారం కొత్తగా ఎన్నికైన డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాయంలో జరిగింది. ఇందులో శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నరును స్టాలిన్ రాజ్భవన్లో కలుసుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. స్టాలిన్ కోరిందే తడవుగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కరోనా నిబంధనలకు లోబడి జరిగింది.