క్రికెట్ టోర్నీల వాయిదాపై.. స్టార్ బౌలర్ కామెంట్స్

ABN , First Publish Date - 2020-04-05T22:07:24+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతోంది. దీన్ని నియంత్రించేందుకు భారత్ లో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా కార్యక్రమాలు వాయిదా వేయాల్సి...

క్రికెట్ టోర్నీల వాయిదాపై.. స్టార్ బౌలర్ కామెంట్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రబలుతోంది. దీన్ని నియంత్రించేందుకు భారత్ లో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ జాబితాలో క్రికెట్ కూడా ఉంది. ఐపీఎల్, సౌతాఫ్రికా సిరీస్ లు రద్దయ్యాయి. ఈ పరిణామాలపై స్టార్ బౌలర్ నవదీప్ సైనీ స్పందించాడు. కరోనా విజృంభిస్తున్న ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ ను వాయిదా వేయడమే సరైన నిర్ణయమని సైనీ అభిప్రాయపడ్డాడు. 'మేం కూడా క్రికెటర్లు కావడానికన్నా ముందు మనుషులమే కదా' అని వ్యాఖ్యానించాడు. మనం లాక్ డౌన్ లో ఉన్నామని జైల్లో కాదని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం ముఖ్యమని, ఈ విపత్తును అధిగమిస్తే భవిష్యత్తులో క్రికెట్ ఆడుకోవచ్చని పేర్కొన్నాడు.

Updated Date - 2020-04-05T22:07:24+05:30 IST