సాధన మొదలెట్టిన సైనా
ABN , First Publish Date - 2020-08-10T09:12:40+05:30 IST
కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ ట్రైనింగ్ను ఆరంభించింది
హైదరాబాద్: కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ ట్రైనింగ్ను ఆరంభించింది. ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్న సైనా.. మరో రెండు వారాల్లో గోపీచంద్ అకాడమీలో మొదలయ్యే జాతీయ క్యాంప్నకు హాజరుకానుంది. గోపీ అకాడమీకి దగ్గర్లోని మరో సెంటర్లో తన భర్త కశ్యప్, కామన్వెల్త్ కాంస్య పతక విజేత గురుసాయిదత్తో కలసి సాధన చేస్తోంది. సాయ్ గోపీ చంద్ అకాడమీలో శిక్షణ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు గత శుక్రవారం నుంచి సాయ్ అనుమతించింది. ‘ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న సెంటర్ చాలా చిన్నది. కొన్ని నెలల బ్రేక్ రావడంతో బేసిక్స్ నుంచి మొదలుపెట్టాం. సైనా ఇప్పుడే మాతో జత కలిసింది. మరో రెండు వారాల్లో గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ ఆరంభించనుంది. మరో చోట సాధన చేసేందుకు గోపీ సార్ నుంచి అనుమతి కూడా తీసుకుంద’ని కశ్యప్ చెప్పాడు.