ఒలింపిక్స్‌కు అవకాశం లేనట్టేనా!

ABN , First Publish Date - 2021-05-08T09:08:50+05:30 IST

స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌కు టోక్యో ఒలింపిక్స్‌ దారులు దాదాపు మూసుకుపోయాయి.

ఒలింపిక్స్‌కు అవకాశం లేనట్టేనా!

సైనా, శ్రీకాంత్‌కు ఎదురుదెబ్బ

మలేసియా ఓపెన్‌ వాయిదా


న్యూఢిల్లీ: స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌కు టోక్యో ఒలింపిక్స్‌ దారులు దాదాపు మూసుకుపోయాయి. విశ్వక్రీడల అర్హతకు మిగిలిన రెండు టోర్నీలలో ఒకటైన మలేసియా ఓపెన్‌ కరోనాతో వాయిదాపడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) శుక్రవారం ప్రకటించింది. ఈనెల 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సిన ఈ సూపర్‌ 750 టోర్నీని మలేసియాలో కొవిడ్‌ విజృంభిస్తుండడంతో వాయిదా వేసినట్టు బీడబ్ల్యూఎఫ్‌ వివరించింది. ఇక జూన్‌ ఒకటి నుంచి జరగాల్సిన సింగపూర్‌ ఓపెన్‌ ఒక్కటే మిగిలింది. కానీ భారత్‌లో కరోనా విలయం సృష్టిస్తుండడంతో మనదేశం నుంచి సింగపూర్‌కు విమానాలను ఆ ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో సైనా, శ్రీకాంత్‌ సింగపూర్‌ ఓపెన్‌లో పాల్గొనడం అనుమానమే. అయితే భారత్‌ కాకుండా వేరే దేశంలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి వారిద్దరు సింగపూర్‌ చేరుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న.

Updated Date - 2021-05-08T09:08:50+05:30 IST