ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-25T09:44:34+05:30 IST
స్థానిక రైతుబజారులో ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శనివారం ప్రారంభించారు.
అనంతపురంరూరల్, అక్టోబరు 24: స్థానిక రైతుబజారులో ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో రూ.100 ఉన్న ఉల్లిని రూ.40లకే ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి, రైతుబజారు ఇన్చార్జ్ ప్రతా్పరెడ్డి పాల్గొన్నారు. రైతు బజారులో ఉల్లి కోసం రెండు కిలో మీటర్ల మేర ప్రజలు క్యూ కట్టారు.