పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-21T04:55:30+05:30 IST

పాలిసెట్‌-22 ప్రవేశాల కౌన్సెలింగ్‌ బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. తొలిరోజు 372 మంది విద్యార్థులు హాజరయ్యా రు. ఈ నెల 23 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా సమన్వయకర్త శ్రీరా మ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు తమవెంట పాలిసెట్‌ ర్యాంకుకార్డు, హా ల్‌టికెట్‌, ఎస్‌ఎస్‌సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీసర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధృవపత్రాలు, ఆధార్‌కార్డు, ఒకసెట్‌ జిరాక్స్‌, ఒక సెట్‌ ఒరిజినల్‌ తీసుకురావాలన్నారు.

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 18: పాలిసెట్‌-22 ప్రవేశాల కౌన్సెలింగ్‌ బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. తొలిరోజు 372 మంది విద్యార్థులు హాజరయ్యా రు. ఈ నెల 23 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని జిల్లా సమన్వయకర్త శ్రీరా మ్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు తమవెంట పాలిసెట్‌ ర్యాంకుకార్డు, హా ల్‌టికెట్‌, ఎస్‌ఎస్‌సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీసర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధృవపత్రాలు, ఆధార్‌కార్డు, ఒకసెట్‌ జిరాక్స్‌, ఒక సెట్‌ ఒరిజినల్‌ తీసుకురావాలన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఈనెల 25లోగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలని, 27న సీట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు. ఈనెల 27 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని అన్నారు.

Updated Date - 2022-07-21T04:55:30+05:30 IST