6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ABN , First Publish Date - 2021-08-01T08:50:53+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం మంత్రివర్గ సమావేశ మందిరంలో జరగనున్నది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపైనా, సంక్షేమ
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం మంత్రివర్గ సమావేశ మందిరంలో జరగనున్నది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపైనా, సంక్షేమ పథకాలపై, శాసనసభా సమావేశాలపై చర్చించే వీలుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. కేబినెట్ నోట్ను ఈ నెల 3 నాటికి సర్క్యులేట్ చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.