అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-17T20:40:52+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శ్రీవారిని ప్రార్థించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో

అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: చంద్రబాబు

తిరుపతి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శ్రీవారిని ప్రార్థించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రికరణతో ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని, ఇలాంటి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని 5 కోట్ల ప్రజల సమస్య అని, ఏపీ ప్రజల భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలన్నారు. ఏపీని అన్ని విధాలా రక్షించాలని శ్రీవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-12-17T20:40:52+05:30 IST