ప్లాస్మా దానం చేయండి: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-08-15T10:32:16+05:30 IST

కొవిడ్‌-19 సోకి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ ..

ప్లాస్మా దానం చేయండి: గవర్నర్‌

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సోకి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. కొవిడ్‌ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహాయం అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా రాజ్‌భవన్‌లో ఏటా సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఎట్‌ హోం కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేశారు. 

Updated Date - 2020-08-15T10:32:16+05:30 IST