రాష్ట్రానికి రాజ్యాంగమే శ్రీరామరక్ష
ABN , First Publish Date - 2021-01-27T06:42:05+05:30 IST
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్రంలో భారత రాజ్యాంగమే శ్రీరామరక్షగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.
అమలాపురం టౌన్, జనవరి 26: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్రంలో భారత రాజ్యాంగమే శ్రీరామరక్షగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురం నల్లవంతెన వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు జిల్లా మహిళాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు పెచ్చెట్టి విజయలక్ష్మి, అధికారి జయవెంకటలక్ష్మి, గెల్లా మీనాకుమారి, నాయకులు ఆశెట్టి ఆదిబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, చిల్లా పురుషోత్తం, నల్లా మల్లిబాబు, పరమట శ్యామ్, కర్రి దత్తుడు, కుసుమ సూర్యమోహనరావు, వెలిగట్ల రామలక్ష్మణరావు, భాస్కర్ల రామకృష్ణ, బండి రామకృష్ణ, నంబూరి రాజేష్, మాకిరెడ్డి వీఎన్ఎస్ పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.