కేంద్రం నిధులతోనే రాష్ట్ర పథకాలు

ABN , First Publish Date - 2020-09-19T10:09:55+05:30 IST

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు పేర్కొన్నారు.

కేంద్రం నిధులతోనే రాష్ట్ర పథకాలు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు

తిమ్మకపల్లిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం


రాయపోల్‌, సెప్టెంబరు 18: కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి రాయపోల్‌ మండలం మంతూరు, తిమ్మకపల్లి గ్రామాల్లో బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రఘునందన్‌రావు ప్రసంగానికి అడ్డు తగలడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మంకిడి స్వామి తదితరులు పాల్గొన్నారు.


ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

దుబ్బాక/మిరుదొడి: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు సూచించారు. మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో శుక్రవారం కార్యకరలతో కలిసి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే భయంతోనే మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతో దుబ్బాక నియోజకవర్గంలో పాగావేశారన్నారు.


టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం ఎన్నికుట్రల పన్నినా కూడా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ఇటీవల బోయ నాగరాజు అనే వ్యక్తి మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని రఘునందన్‌ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రోశయ్య, భిక్షపతి, బాలే్‌షగౌడ్‌, దేవరాజు, కొండల్‌రెడ్డి, మల్లేశం, ప్రవీన్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T10:09:55+05:30 IST