రాష్ట్రంలో దోపిడీ పాలన: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-10-22T00:58:56+05:30 IST

రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

రాష్ట్రంలో దోపిడీ పాలన: ఉత్తమ్

హైదరాబాద్: రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులలో సీఎం కేసీఆర్‌ ఎనిమిది శాతం, లిక్కర్‌ వ్యాపారంలో ఎమ్మెల్యేలు 10శాతం కమీషన్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? అని ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజలు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వాటిని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యేలు పెద్దమొత్తంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ బదిలీకి రూ.20లక్షలు, సీఐకి రూ.10 లక్షలు, ఎస్‌ఐ బదిలీకి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2021-10-22T00:58:56+05:30 IST