అంబేద్కర్ జయంతిలోపే విగ్రహం ఏర్పాటు చేయాలి: ఎల్.రమణ
ABN , First Publish Date - 2020-02-22T20:35:42+05:30 IST
హైదరాబాద్: అంబేద్కర్ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని..
హైదరాబాద్: అంబేద్కర్ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అలా జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఎల్.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.