విగ్రహాల ఏర్పాటు వివాదాస్పదం
ABN , First Publish Date - 2021-05-19T07:01:59+05:30 IST
అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎస్సీల్లోని రెండు సామాజిక వర్గాలు ఒకేచోట రెం డు విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించడం వివాదాస్పదమైంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జె.ప్రభాకరరా వు మంగళవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.
స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్
అద్దంకి టౌన్, మే 18: అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎస్సీల్లోని రెండు సామాజిక వర్గాలు ఒకేచోట రెం డు విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించడం వివాదాస్పదమైంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జె.ప్రభాకరరా వు మంగళవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మణికేశ్వరం లో ఒక సామాజికవర్గానికి చెందిన వారు డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఉపక్రమించారు. మరో సామాజిక వర్గం వారు కూడా అదేప్రాంతంలో బాబూజగ్జీవన్రామ్ విగ్ర హం ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. దీం తో వివాదం మొదలైంది. తహసీల్దార్ ప్రభాకరరావు ఆ స్థలా న్ని పరిశీలించారు. ఇరు వర్గాలకు చెందిన వారెవ్వరూ అక్క డికి రాలేదు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్ర జలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసు కున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఇరువర్గీయులను పిలిపించి మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా చూస్తా మ న్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.