స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఉధృతం

ABN , First Publish Date - 2021-09-19T05:22:57+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఉధృతం
సమావేశంలో పాల్గొన్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 18: స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. ప్లాంట్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు, ఢిల్లీలో ధర్నాలు, పాదయాత్రలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ  కార్యక్రమంలో ప్రతినిధులు మంత్రి రాజశేఖర్‌, వైటీ దాసు, గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌.రావు, సత్యారావు, శ్రీనివాసరావు, జి.గణపతిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-19T05:22:57+05:30 IST