‘జిందాల్’ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-01-17T05:27:39+05:30 IST
అప్పన్నపాలెంలోని జేఎస్ఎల్ (జిందాల్ స్టెయిన్లెస్) కర్మాగారాన్ని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
కొత్తవలస: అప్పన్నపాలెంలోని జేఎస్ఎల్ (జిందాల్ స్టెయిన్లెస్) కర్మాగారాన్ని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కర్మాగారాన్ని మూసేయడం వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంతో కార్మికులకు ఎటువంటి సమస్యలు లేకున్నా కర్మాగారాన్ని ఆకస్మికంగా మూసివేసి... వేరే రాష్ట్రం లోని పరిశ్రమకు కార్మికులు వెళ్లాలని సూచించడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూసేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంద ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమ తెరిపించేందుకు కృషి చేయాలని కోరారు.