తప్పుచేస్తూ దొరికిపోయిన స్టీవ్ స్మిత్.. ఛీకొడుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-01-12T01:53:03+05:30 IST

భారత్ ఆటగాళ్లు హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాట పటిమతో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. విహారి, అశ్విన్ ఓర్పును నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తప్పుచేస్తూ దొరికిపోయిన స్టీవ్ స్మిత్.. ఛీకొడుతున్న నెటిజన్లు!

సిడ్నీ: భారత్ ఆటగాళ్లు హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాట పటిమతో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. విహారి, అశ్విన్ ఓర్పును నెటిజన్లు అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తప్పు చేస్తూ ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ అడ్డంగా దొరికిపోయాడు. దీన్ని చూసిన నెటిజన్లంతా అతన్ని ఛీకొడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఆట రెండో సెషన్‌లో ఈ ఘటన జరిగింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు.


అదే సమయంలో డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఆటగాళ్లందరూ బ్రేక్‌కు వెళ్లినప్పుడు మైదానంలోనే ఆగిపోయిన స్టీవ్ స్మిత్.. బ్యాటింగ్ సమయంలో వికెట్ల వద్ద పంత్ చేసుకున్న గార్డ్ మార్కును చెరిపేశాడు. ఈ ఉదంతం మొత్తం మెయిల్స్ కెమెరాకు చిక్కింది. దీంతో స్మిత్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. దీన్ని షేర్ చేసిన సెహ్వాగ్.. స్మిత్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజాయితీగా ఆడకుండా, ఇలా అడ్డదార్లు తొక్కడమేంటని? స్మిత్‌ను ప్రశ్నిస్తున్నారు. భారత కెప్టెన్ రహానే కూడా మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో దీని గురించి ప్రశ్నించాడు. గతంలో కూడా స్మిత్ ఇలానే బాల్‌ట్యాంపరింగ్ చేస్తూ దొరికిపోయి నిషేధానికి గురైన విషయం తెలిసిందే.



Updated Date - 2021-01-12T01:53:03+05:30 IST