రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-10-22T06:41:07+05:30 IST
పాలసముద్రంలోని బలిజకండ్రిగ- జీడీనెల్లూరు ప్రధాన రహదారిలో తారురోడ్డు ధ్వంసమై బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గురువారం జనసేన నేతలు యుగంధర్, సతీష్ బురదలో పొర్లుతూ సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బురదలో పొర్లుదండాలు
పాలసముద్రంలోని బలిజకండ్రిగ- జీడీనెల్లూరు ప్రధాన రహదారిలో తారురోడ్డు ధ్వంసమై బురదమయంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గురువారం జనసేన నేతలు యుగంధర్, సతీష్ బురదలో పొర్లుతూ సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి పదవిఽపై ఉన్న ధ్యాస నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి లేదని యుగంధర్ విమర్శించారు. ఈనెల 27లోపు రోడ్లను బాగుచేయకుంటే, 29న తామే బాగుచేయడానికి పూనుకుంటామన్నారు. నేతలు రమేష్, యువరాజ్, నరేష్, డిల్లీ, గోవింద్, గిరి పాల్గొన్నారు.
- పాలసముద్రం