స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-06T21:29:40+05:30 IST

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) స్వల్ప లాభాలను ఆర్జించాయి.

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు!

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) స్వల్ప లాభాలను ఆర్జించాయి. నష్టాలతో ప్రారంభమై కాసేపటికి లాభాల్లోకి వచ్చి మళ్లీ నష్టాల్లోకి జారుకుని చివరకు స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. 49,441 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 49,201 వద్ద రోజును ముగించింది. ఇక, 14,737 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 14,683 వద్ద రోజును ముగించింది. అదానీ పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాలను ఆర్జించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎయిచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.  

Updated Date - 2021-04-06T21:29:40+05:30 IST