లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-06T16:14:27+05:30 IST

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. 49,441 వద్ద ఈ రోజు (మంగళవారం) ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10.30 గంటల సమయానికి 200 పాయింట్లు లాభపడింది. ఇక, 14,737 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10.30 గంటల సమయానికి 77 పాయింట్లు ఎగబాకింది. అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్ లాభాల్లో పయనిస్తుండగా.. టైటాన్, హెచ్‌సీఎల్, గ్రాసిమ్, బ్రిటానియా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. అలాగే ఈ వారం విడదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. 

Updated Date - 2021-04-06T16:14:27+05:30 IST