మైనారిటీస్ భవన్‌పై రాళ్లు విసిరిన దుండగులు

ABN , First Publish Date - 2020-08-15T02:28:30+05:30 IST

మంగళూరులోని పండేశ్వర్‌లో మౌలానా అజాద్ మైనారిటీస్ భవన్‌పై నిన్న రాత్రి గుర్తు తెలయని వ్యక్తులు రాళ్లదాడి...

మైనారిటీస్ భవన్‌పై రాళ్లు విసిరిన దుండగులు

మంగళూరు: మంగళూరులోని పండేశ్వర్‌లో మౌలానా అజాద్ మైనారిటీస్ భవన్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి దుండగుల రాళ్లు విసరడంతో మూడు అద్దాలు ధ్వసం అయినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మైనారిటీ శాఖకు చెందిన తాలూకా ఎక్స్‌టెన్సన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మంగళూరు సౌత్ పోలీసులు ముమ్మర విచారణ ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ సహా పలువురు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. భవనానికి పోలీసు భద్రత కల్పించారు. ఇటీవల బెంగళూరులో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో నగరంలో పోలీసులు అప్రమత్తత పాటిస్తున్నారు.

Updated Date - 2020-08-15T02:28:30+05:30 IST