అసాంఘిక చర్యలను అరికట్టండి

ABN , First Publish Date - 2022-01-20T03:09:04+05:30 IST

ఆకతాయిల చర్యలను అరికట్టాలని ఇన్సాఫ్‌కమిటీ సభ్యులు, మహిళలు బుధవారం ఒకటో పట్టణ సీఐ నాగేశ్వరమ్మకు విన్నవించారు.

అసాంఘిక చర్యలను అరికట్టండి
సీఐ నాగేశ్వరమ్మకు వినతిపత్రం అందజేస్తున్న ఇన్సాఫ్‌కమిటీ సభ్యులు, మహిళలు

పట్టణ సీఐ నాగేశ్వరమ్మకు వినతి

గూడూరు, జనవరి 19: ఆకతాయిల చర్యలను అరికట్టాలని ఇన్సాఫ్‌కమిటీ సభ్యులు, మహిళలు బుధవారం ఒకటో పట్టణ సీఐ నాగేశ్వరమ్మకు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక షాదీమంజిల్‌, నమాజ్‌కట్ట, దర్గావీఽధి ప్రాంతాల్లో రాత్రివేళల్లో కొందరు మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.  పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో కొందరు యువకులు సైలెన్సర్‌లు తొలగించిన బైక్‌లపై అతివేగంగా వెళుతూ ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో జమాలుల్లా, చాన్‌బాషా, వెంకటేశ్వర్లు, జమీర్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T03:09:04+05:30 IST