ఇసుక తవ్వకాలు నిలిపేయండి
ABN , First Publish Date - 2020-08-03T10:02:04+05:30 IST
దిమ్మిడిజోల సమీపంలో వంశధారలో ఇసుక తవ్వకాలను నిలిపివే యాలని టీడీపీ నేతలు ఎస్ఎస్ ప్రకాశరావు, ఎన్.జగదీశ్వరరావు డిమాండ్ చేశా రు.
భామిని: దిమ్మిడిజోల సమీపంలో వంశధారలో ఇసుక తవ్వకాలను నిలిపివే యాలని టీడీపీ నేతలు ఎస్ఎస్ ప్రకాశరావు, ఎన్.జగదీశ్వరరావు డిమాండ్ చేశా రు. ఈమేరకు ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా అనుమతులు ఉన్నాయంటూ ఇసుక తవ్వకాలు చేపట్టి... ఆంధ్రా సరిహద్ద్దు గ్రామం దిమ్మిడిజోల మీదుగా తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశధార పిల్ల కాలువను మూసేసి ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం అన్నారు. దిమ్మిడిజోల, సొలకిరి మధ్యలో రైతుల పొలాల నుంచి రోడ్డు వేయడం చట్టవ్యతిరేకమన్నారు. నదిలో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. నిరంతరం లారీలతో ఇసుక తరలించడంతో కరకట్టలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.