ఆ బియ్యాన్ని భద్రపరచండి
ABN , First Publish Date - 2020-09-23T08:14:19+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాడవుతున్న మధ్యాహ్న భోజన బియ్యంపై విద్యాశాఖ స్పందించింది.
విద్యాశాఖ ఆదేశాలు..
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాడవుతున్న మధ్యాహ్న భోజన బియ్యంపై విద్యాశాఖ స్పందించింది. సర్కారు బడుల్లో వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎలుకల పాలవుతోందని, వర్షానికి తడుస్తూ కుళ్లిపోతుందంటూ ‘భోజనం లాక్డౌన్’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ .. పాఠశాలలు తెరిచేవరకు నిల్వ ఉన్న బియ్యం పాడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
లేకుంటే బియాన్ని జిల్లా యంత్రాంగానికి వెనక్కి ఇవ్వాలని కోరారు. కాగా, పాఠశాలల్లోని బియ్యం వెనక్కి తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ నిరాకరించినట్లు తెలిసింది. తమ వద్దే భారీగా బియ్యం నిల్వలున్నందున పాత కుళ్లిపోయిన బియ్యా న్ని తీసుకోలేమని ఆ శాఖ విద్యాశాఖకు స్పష్టం చేసినట్లు తెలిసింది.