ఒంగోలులో ‘గ్రీన్‌’ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-05-28T10:42:44+05:30 IST

ఒంగోలు నగరంలో రెండు నెలల అనంతరం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారు. గురువారం నుంచి అన్ని

ఒంగోలులో ‘గ్రీన్‌’ సిగ్నల్‌

  • ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణాలు 
  • గోపాల్‌నగర్‌, ఏకలవ్యనగర్‌లోని కొద్ది ప్రాంతంలోనే ఆంక్షలు
  • అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం 
  • మంత్రి బాలినేని  వెల్లడి 


ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఒంగోలు నగరంలో రెండు నెలల అనంతరం లాక్‌డౌన్‌ ఆంక్షలను  సడలించారు. గురువారం నుంచి అన్ని వ్యాపార సంస్థలూ నిబంధనల మేరకు నడిపే అవకాశాన్ని కల్పిం చారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఉదయం నుంచి రాత్రి వరకూ ఇవి నడవనున్నాయి. పూర్తిస్థాయి జాగ్రత్తలతో కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి ఒం గోలును తొలగించినట్లు రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డి వెల్లడించారు. గోపాల్‌నగర్‌, ఏకలవ్యనగర్‌లలో కొద్ది ప్రాంతంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఇస్లాంపేటలో అనేక మందికి మరోసారి పరీక్షలు నిర్వహించినా నెగెటివ్‌ ఫలితాలే వచ్చా యని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు పనిచేస్తాయన్నారు. ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయని తెలిపారు. షాపింగ్‌ మాల్స్‌, సినిమాహాళ్లు, రెస్టారెంట్లకు మాత్రం ఆంక్షలు వర్తిస్తాయన్నారు. 

Updated Date - 2020-05-28T10:42:44+05:30 IST