అయోధ్యలో నాగా సాధువు హత్య!
ABN , First Publish Date - 2021-04-04T17:32:37+05:30 IST
యూపీలోని అయోధ్యలో నాగా సాధువు హత్యకు గురయ్యారు.
అయోధ్య: యూపీలోని అయోధ్యలో నాగా సాధువు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నాగా సాధువు తలపై ఇటుకతో మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. హనుమాన్గఢీ నాగాసాధువు మహంత్ కన్నయ్యా దాస్.... చరణ్ పాదుకా మందిరంలోని గోశాలలో ప్రతిరోజూ నిద్రిస్తుంటారు.
ఈ రోజు ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. మహంత్ కన్నయ్యా దాస్... హనుమాన్గఢీకి చెందిన బసంతియా పట్టీకి అనుబంధంగా ఉన్న గుల్ చమన్బాగ్కు చెందిన మహంత్. అతను నిద్రిస్తున్న సమయంలో ఈ హత్య జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.