విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : భగత
ABN , First Publish Date - 2021-06-18T06:54:58+05:30 IST
వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే నోముల భగత హెచ్చరించారు.
నాగార్జునసాగర్, జూన 17 : వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే నోముల భగత హెచ్చరించారు. గురువారం ఆయన ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఉదయం 9గంటలకు సైతం డాక్టర్లు రాకపోవడం ఏమిటని సీఎంవోను ప్రశ్నించారు. అంతేగాకుండా మే నెలలో ఉదయం 8గంటలకు అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పైలాన కాలనీకి చెందిన మహబూబ్ అలీ మరణించిన సంఘటనపై సెక్యూరిటీ డోర్లు ఎందుకు ఓపెన చేయలేదని, డ్యూటీ డాక్టర్లు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బ ందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎంవోను ప్రశ్నించా రు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వై ద్యం అందించాలన్నారు. సిబ్బంది అంతా సకాలంలో విధులకు హా జరై సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన రఘువీర్, కౌన్సిలర్లు మంగ్త, రమే్షజీ, ఇందిర, రామకృష్ణ, ఆస్పత్రి సీఎంవో డాక్టర్ భానుప్రసాద్నాయక్, వైద్యులు చక్రవర్తి, నాయకులు బ్రహ్మరెడ్డి, శరతరెడ్డి, మోహన, విక్రం పాల్గొన్నారు.
ఆస్పత్రికి రూ. 7.25లక్షలతో నూతన జనరేటర్
ఏరియా ఆసుపత్రిలో నెల రోజులుగా జనరేటర్ లేక విద్యుత అంతరాయం ఏర్పడినపుడు రోగులు ఇబ్బందులు పడుతున్నారని సీఎంవో భానుప్రసాద్నాయక్ ఎమ్మెల్యే నోముల భగత దృష్టికి తీసుకెళ్లగా 10రోజుల్లో రూ.7.25లక్షల వ్యయంతో నూతన జనరేటర్ను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా ఆస్పత్రికి ఏమైనా అవసరమైతే తన దృష్టికి తెస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.